కోర్టులో నాగార్జున స్టేట్మెంట్
NEWS Oct 08,2024 10:54 am
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ధర్మానసం ఆదేశాల మేరకు.. నేడు నాగార్జున నాంపల్లి కోర్టుకు వెళ్లి తన వాదన వినిపించారు. అమల, నాగచైతన్య కూడా కోర్టుకు వెళ్లారు. నాగార్జున స్టేట్మెంటును కోర్టు రికార్డు చేసింది. నాగార్జున వాంగ్మూలంతో పాటు సాక్షుల స్టేట్మెంట్లను కూడా కోర్టు రికార్డు చేసింది. సాక్షిగా సుప్రియ తన స్టేట్మెంట్ ఇచ్చారు.