జమ్మూకశ్మీర్ పీఠం ఎన్సీ-కాంగ్రెస్దే!
NEWS Oct 08,2024 10:38 am
జమ్ముకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్సీ 41 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ 3 స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.