గవర్నమెంట్ ఫ్లీడర్గా గోనే రాజేశ్
NEWS Oct 08,2024 10:27 am
కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గోనే రాజేష్ ఖన్నాని రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిసింట్ గవర్నమెంట్ ఫ్లీడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోరుట్ల ప్రాంతానికి చెందిన రాజేశ్ 2008లో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి, పలు సివిల్ క్రిమినల్ కేసులు వాదించారు. 3 ఏళ్లపాటు గవర్నమెంట్ తరఫున పలు సివిల్ కేసులు వాదించారు. తన నియమాకానికి సహకరించిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్షింగారావు, సీనియర్ నాయకులు కృష్ణ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.