హిజ్రాలకు పోలీసుల కౌన్సిలింగ్
NEWS Oct 08,2024 10:09 am
మల్యాల మండలంలోని హిజ్రాలకు మంగళవారం పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించారు. మల్యాల, కొండగట్టు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న హిజ్రాలకు మల్యాల ఎస్సై నరేష్ కౌన్సిలింగ్ చేశారు. ప్రజలకు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి వద్ద బలవంతపు వసూళ్లు చేయరాదని హిజ్రాలకు పోలీసులు సూచించారు. ఇటీవల హిజ్రాలు బస్సుల్లో ప్రయాణికులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.