108 రామాయణ మహా గ్రంథాల పంపిణీ
NEWS Oct 08,2024 10:04 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని గట్టాయిగూడెం శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో 108 రామాయణ మహా కావ్యాలను భక్తులకు ఉచితంగా పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణం మహా గ్రంధాన్ని భక్తులు ఎందుకు అభ్యసించాలి అనే అంశాలను విశధీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వింజమూరి వేణుగోపాలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.