తాజ్మహల్కు మాల్దీవుల అధ్యక్షుడు
NEWS Oct 08,2024 05:46 am
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తన సతీమణితో కలిసి తాజ్మహల్ను సందర్శించారు. తాజ్మహల్ ముందు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. 4 రోజుల ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయిలో సమాలోచనలు జరిపారు. భారత్, మాల్దీవుల బంధం శతాబ్దాల నాటిదని మోదీ చెప్పారు.