ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం
NEWS Oct 07,2024 02:28 pm
కథలాపూర్: శ్రీ భూనీల బోధ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం చేయడానికి రిక్కల సంజీవరెడ్డి జల ముందుకు రావడంతో గ్రామస్తులు వారిని అభినందించారు. కథలాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకుగాను సంజీవరెడ్డి 12 నెలలు పూర్తిగా అన్నదానం చేస్తానని చెప్పడంతో వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.