పోగొట్టుకున్న,చోరి గురైన104 ఫోన్లను
బాధితులకు అప్పగించిన ఎస్పీ అశోక్
NEWS Oct 07,2024 12:56 pm
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 104 మొబైల్ ఫోన్లను (సుమారు 20 లక్షల విలువగల) బాధితులకు అందించారు పోలీసులు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరి గురైన 104 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.