మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు
NEWS Oct 07,2024 11:49 am
మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా జీవన్ రెడ్డి, డైరెక్టర్లు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లీశ్వరి మాట్లాడుతూ.. మల్యాల, కొడిమ్యాల మండలంలోని రైతుల సమస్యలను పరిష్కరించడానికి పాలకవర్గంతో కలిసి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, నర్సింహారెడ్డి, మల్లేష్ గౌడ్, నారాయణ, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.