మార్కెట్ కమిటీ ఛైర్మన్ బీసీలకు ఇవ్వాలి
NEWS Oct 07,2024 04:37 pm
మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్గా 55 శాతానికి పైగా ఉన్న బీసీలకు అవకాశం రాలేదని ఈ దఫా జనరల్ మహిళకు రిజర్వ్ అయినందున బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు.