అమ్మవారికి బోగ శ్రావణి ఒడిబియ్యం
NEWS Oct 07,2024 09:38 am
జగిత్యాల పట్టణంలోని భక్త మార్కండేయ ఆలయంలో కొలువైన శ్రీగాయత్రి దుర్గా అమ్మవారిని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పద్మశాలి సంఘ అధ్యక్షులు బోగ గంగాధర్, ఓల్లాల గంగాధర్, ఆడెపు సత్యం తదితరులు పాల్గొన్నారు.