డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక
వసతుల పనులను పరిశీలించిన MLA
NEWS Oct 07,2024 07:41 am
నుకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్లలో మౌలిక వసతుల నిర్మాణ పనులను అధికారులతో కలిసి జగిత్యాల MLA సంజయ్ కుమార్ పరిశీలించారు. జగిత్యాల పట్టణానికి చెందిన నిరుపేదలకు కోసం గతంలో నుకపల్లిలో 4520 ఇండ్లు నిర్మించడం జరిగిందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కరెంటు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంక్, మొదలైన మౌలిక వసతులకు పనులు జరుగుతున్నాయని త్వరలోనే వాటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు.