అమ్మవారి సన్నిధిలో మహా యజ్ఞం
NEWS Oct 07,2024 05:53 am
తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్లాలని, అదేవిధంగా గ్రామంలో పాడి పంటలు సంతోషంగా ఉండాలని ఇప్పపల్లి గ్రామంలోని అమ్మవారి సన్నిధిలో మహా యజ్ఞం నిర్వహించారు. మహా యజ్ఞంలో జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్ చారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.