సింగిల్ విండో నూతన భవనం ప్రారంభం
NEWS Oct 06,2024 04:51 pm
మల్యాల మండలం పోతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో భవనాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతారం PACS చైర్మన్ సాగర్ రావు, డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.