సాగర్ ఎడమ కాలువలో టీచర్ గల్లంతు
NEWS Oct 06,2024 04:57 pm
నల్గొండ: వేములపల్లి మండలం రావులపెంట శివారులో శనివారం రాత్రి సాగర్ కాల్వలో ఒకరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూష(35) అంగన్వాడీ టీచర్ గా విధులు ముగించుకుని తన భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. భార్య గల్లంతవగా, భర్త ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.