Logo
Download our app
జిల్లాలో పడిపోయిన ఉల్లి సాగు
NEWS   Oct 06,2024 03:53 pm
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,600 ఎకరాల్లో సాగయ్యే ఉల్లి పంట ఈ సారి 1,200 ఎకరాలకు పడిపోయింది. గత ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకకపోవడంతో ఈ ఏడాది సాగు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగు చేసిన కొద్దిపాటి ఉల్లి పంట కూడా దెబ్బతింది. క్వింటా ఉల్లి ధర జూలైలో రూ.2 వేలు ఉండగా.. సెప్టెంబరులో రూ.5,600 లకు పెరిగింది.
⚠️ You are not allowed to copy content or view source