సెలవుల్లో పిల్లల పట్ల జాగ్రత్త
NEWS Oct 06,2024 10:14 am
దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారే పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ఏటా దసరా సెలవుల్లో ఎంతో మంది విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్న వారికి కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.