ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ
NEWS Oct 06,2024 04:59 am
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామం చెందిన నిరుపేద వైద్యం కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. గ్రామం చెందిన రాజయ్య అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా, ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో 42 వేల రూపాయల చెక్కు మంజూరు కాగా నేడు పిఎసిఎస్ డైరెక్టర్ సిద్ధిరాములు రాజయ్య కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.