Logo
Download our app
కొండగట్టులో ఎస్సై శ్రమదానం
NEWS   Oct 05,2024 06:25 pm
మల్యాల మండలం ముత్యంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొండగట్టు స్టేజి వద్ద శనివారం స్థానిక ఎస్ఐ నరేష్ శ్రమదానం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారి దెబ్బతిని గుంతలు పడడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికులు ఈ విషయాన్ని ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించి తన సొంత ఖర్చులతో సిమెంటు, కాంక్రీట్ తో గుంతలను జెసిబితో పూడ్చి చదును చేశారు. ఈ కార్యక్రమంలో ఒల్లాల మల్లేశం, పంజాల మల్లేశం, మనోజ్ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source