లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWS Oct 05,2024 06:02 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు వెంకంపెటకు చెందిన సిరిపురం లావణ్య సుందరయ్యనగర్ కు చెందిన గాజుల నరహరి లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు చేతుల మీదుగా అందించారు. 50 వేలు గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్లూరి రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని అన్నారు.