భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
NEWS Oct 05,2024 05:46 pm
అమరాపురం మండలం హేమావతి శ్రీ హెంజేరు సిద్దేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తాదుల కోసం నూతనంగా నిర్మించనున్న రెస్ట్ రూమ్ నిర్మాణ పనులకు శనివారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు,మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి కన్వీనర్ గణేష్,ఎక్స్ కన్వీనర్ శివరుద్రప్ప, ఎక్స్ జెడ్పిటిసి నరసింహమూర్తి, మడకశిర ఎస్సీ సెల్ అధ్యక్షుడు జయకుమార్, మాజీ సర్పంచ్ లు కుమార్ స్వామి, తదితర స్థానిక టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.