నవదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NEWS Oct 05,2024 05:52 pm
జగిత్యాల పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో ఏర్పాటు చేసిన నవదుర్గా అమ్మవారు శనివారం చంద్ర ఘంటా దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి. నవదుర్గ సమితి ట్రస్ట్ సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేసి సన్మానించారు. సాయంత్రం అమ్మవారికి వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించారు.