సరస్వతీ పుత్రులకు సన్మానం
NEWS Oct 05,2024 10:39 am
ఇటీవలే మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బద్దం రశ్మిత ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించడం, డీఎస్సీలో జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ శ్రేణిలో ర్యాంకులు సాధించి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించడం పట్ల చిట్టాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వారిని అభినందించి ఘన సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి యువతరానికి వీరు స్ఫూర్తి ప్రదాతలుగా ఉంటారని, కృషి పట్టుదలలే వారి విజయానికి నాందిగా వారి తల్లిదండ్రుల కలలు నెరవేర్చి గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు.