వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ
NEWS Oct 05,2024 09:12 am
మెట్పల్లి మండలం వేంపేట్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసి, ప్రముఖ వైద్యులు డా. రాజమల్లయ్య తన పుట్టినరోజు సందర్బంగా వృద్దులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసారు. రేగుంటలోని నివేదిత వృద్ధుల ఆశ్రమాన్ని రాజమల్లయ్య సందర్శించారు. రానున్న శీతకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వృద్ధులకు రెండు దుప్పట్లతో పాటు, బ్రెడ్ పాకెట్, పండ్లు అందించారు.