కొండా సురేఖపై పరువు నష్టం దావా
NEWS Oct 03,2024 12:26 pm
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం, క్రిమినల్ కేసులు వేశారు. కొండా సురేఖ తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలను దెబ్బతీశారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటులు మండిపడుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ ఇప్పటికే సమంత విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు.