Logo
Download our app
పంచాయతీ కమిషనర్ గా సత్యనారాయణ
NEWS   Sep 27,2024 05:45 pm
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నూతన కమిషనర్ గా ఎం.సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సత్యనారాయణ అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుంచి ఏలేశ్వరం బదిలీపై వచ్చారు. ప్రస్తుత కమిషనర్ గా ఉన్న కేశవ ప్రసాద్ విశాఖ జోనల్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. సత్యనారాయణ మాట్లాడుతూ అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
⚠️ You are not allowed to copy content or view source