Logo
Download our app
ఫోన్‌ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం విచారణ చేస్తుంది: డీజీపీ
NEWS   Sep 24,2024 05:36 pm
ఫోన్‌ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీఎం విచారణ చేస్తుందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. HYD సీపీ, వెస్ట్‌జోన్‌ డీసీపీ విచారణ చేస్తున్నారని తెలిపారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుకు రెడ్‌కార్నర్ నోటీసు ఇవ్వటానికి ఇంత సమయం పట్టిందన్నారు. రెడ్‌ కార్నర్‌ నోటీసుల కోసం ఇంటర్‌పోల్‌కి లేఖ రాశామని.. సీబీఐకి రాగానే రెడ్‌ కార్నర్ నోటీసు జారీ చేస్తామన్నారు. తెలంగాణ చుట్టుపక్క రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉందన్నారు. మావోయిస్టుల కట్టడికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source