ఇప్పపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆందోళన
NEWS Sep 24,2024 01:43 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామానికి చెందిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని పోతారం గ్రామస్తులు అక్రమించారని ఇప్పపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు, ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించలేదని, అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని, ప్రభుత్వ భూమిని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని డీఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామస్తులకు తెలిపారు, ఇప్పపల్లి 12 మంది గ్రామస్తులపై పెట్టిన కేసులను తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.