తమ్ముని మరణాన్ని చూసి తట్టుకోలేక అన్న మృతి
NEWS Sep 22,2024 06:19 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడ గ్రామంలో రెడ్డిమల్ల నర్సయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. తమ్ముడి మరణ వార్త విన్న అన్న రెడ్డిమల్ల వెంకటయ్య నాకన్నా ముందే మమ్మల్ని వదిలి పోయావా తమ్ముడు అంటూ మృతదేహం వద్ద రోధించి మనోవేదనకు గురైనారు. తమ్ముడు ఆదివారం మృతి చెందాడు. ఒక రోజు తేడాతో అన్నదమ్ములిద్దరు మరణించడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.