బీఆర్ఎస్ బీసీ నేతల కీలక నిర్ణయం
NEWS Sep 21,2024 01:15 pm
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై బీఆర్ఎస్ బీసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కుల గణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 10లోగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కుల గణన చేసి, 42 శాతం రిజర్వేషన్ల కల్పన, బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని సమావేశం నిర్ణయించింది.