సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
NEWS Sep 18,2024 05:15 pm
AP: తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ‘నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందా. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అన్నదానం కూడా సరిగ్గా నిర్వహించలేదు. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా పెంచుతాం’ అని స్పష్టం చేశారు.