నీటి పొదుపుపై అవగాహన పోస్టర్లు
NEWS Sep 18,2024 05:07 pm
ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నీటి పొదుపుపై అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఛైర్ పర్సన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణకోటికి జీవనాధారమైన నీటిని వృధా చేయకుండా పరిమితంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బాల్మోహన్, కార్యదర్శి కార్కూరి చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.