రాజమండ్రిలో 9 షాపులపై కేసులు
NEWS Sep 18,2024 06:28 am
తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని 9 ఎడిబుల్ ఆయిల్ దుకాణాలను మంగళవారం తనిఖీ చేసి తొమ్మిది కేసులు నమోదు చేశామని రీజనల్ విజిలెన్స్ ఎస్పి సుబ్బారెడ్డి తెలిపారు. ఆయిల్ ధరలు పెరుగుతున్న కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామన్నారు. హోల్ సేల్ రిటైల్ వర్తకులు ఆయిల్ గరిష్ట ధర కన్నా ఎక్కువ ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.