తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
NEWS Sep 17,2024 11:05 am
సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహంను ఆవిష్కరించాల్సిన స్థానంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని తెలంగాణ చౌక్ లో తెలంగాణ తల్లి పాలాభిషేకం చేసి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పట్ల నిరసన వ్యక్తం చేశారు.