మైహోం గణేషుడి లడ్డూ కొత్త రికార్డు!
NEWS Oct 08,2025 11:07 am
HYD: వేలంలో గతేడాది ఏకంగా రూ.27 లక్షలు పలికి.. బాలాపూర్ గణేషుని లడ్డూ కొత్త రికార్డు సృష్టిస్తే.. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేశాడు మాదాపూర్ మైహోమ్ భుజా వినాయకుడు. హోరాహోరీగా సాగిన వేలం పాటలో ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్.. లడ్డూను రూ. 29 లక్షలకు సొంతం చేసుకున్నాడు. దీంతో.. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా.. మైహోం భుజా గణనాథుని లడ్డూ నిలిచింది.