దరఖాస్తుల ఆహ్వానం
NEWS Sep 13,2024 04:46 pm
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో చేరేందుకు ఈనెల 15లోపు దరఖాస్తులు అందజేయాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 16 నుంచి 25 వరకు అపరాధ రుసుముతో ఆన్ లైన్ లో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. జిల్లాలోని డిప్యూటీ డిఈవోలు, ఎంఈఓలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి 2022 - 24 మార్చి వరకు పదో తరగతి ఉత్తీర్ణత పొందని వారిని గుర్తించాలన్నారు.