గురుకుల విద్యార్థుల ఆందోళన
NEWS Sep 12,2024 06:36 am
రాజన్న సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలలో బాలికల విద్యార్థినులను వేధిస్తున్న పీఈటీ జ్యోత్స్నను వెంటనే సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యార్థినిలు రోడ్డుపై బైటయించారు. నెలవారీ సమయంలో బాత్రూమ్కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ జ్యోత్స్నాను వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి, లోపలికి వెళ్లి తమను మొబైల్ ఫోన్లో వీడియోలు తీయడంతో పాటు కొడుతోందని విద్యార్థుల ఆరోపించారు.