3,023 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం
NEWS Sep 12,2024 06:42 am
కె. గంగవరం మండలం సత్యవాడ నుంచి గొల్లపాలెంకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని మంగళవారం రాత్రి ద్రాక్షారామలో పట్టుకున్నామని రాజమహేంద్రవరం విజిలెన్సు సీఐ సి. నాగవెంకటరాజు తెలిపారు. వాహనంలో 68బస్తాల్లో 3023 కిలోల బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.39 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఎంఎస్వో సుబ్బరాజు ఫిర్యాదుతో ఎస్సై లక్ష్మణ్ ఇద్దరిని అరెస్టు చేశారు.