Logo
Download our app
కొండగట్టులో మహిళా కిడ్నాపర్
NEWS   Sep 12,2024 06:44 am
మాల్యాల మండలం కొండగట్టులో బుధవారం ఓ మహిళ బాలుడి అపహరణకు యత్నించింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మూడేళ్ల బాలుడు కిరాణా షాపుకు వెళ్లగా గుర్తు తెలియని మహిళ బాలుడిని పట్టుకుని తీసుకెళ్తోంది. దుకాణ యజమాని గమనించి బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని సదరు మహిళను స్థానికులతో కలిసి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source