Logo
Download our app
వరద బాధితుల కోసం సీఎంకు కురుమ సంఘం 10 ల‌క్ష‌ల విరాళం
NEWS   Sep 08,2024 06:21 pm
వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ కురుమ సంఘం రూ. 10 ల‌క్ష‌లు అందించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, తెలంగాణ షెపర్డ్ ఇండియా అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు బూరుగడ్డ పుష్ప నగేష్, దానసిరి ప్రకాష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source