నీట మునిగిన పంట పొలాలు
NEWS Sep 08,2024 06:34 am
దేవీపట్నం: రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పూడిపల్లి, పోతుకొండ గ్రామాలకు చెందిన రైతులు పొలాల్లోకి వరద నీరు చేరిందని అధికారులు తెలిపారు. పొలాల్లోకి వస్తున్న నీరు బయటకు పోయే మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు మండలంలో 47 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.