నీటి సమస్య తీర్చండి మహాప్రభో!
NEWS Sep 07,2024 04:17 pm
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం గ్రామంలో గత వారం రోజుల నుంచి నీటీ కష్టాలు అధికమయ్యాయని గ్రామ ప్రజలు వాపోయారు. బోర్ మరమ్మతులకు గురై వారం అవుతున్న సంబంధిత అధికారులు వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోవడంతో. పట్టణ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పంచాయతీ నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.