Logo
Download our app
పెనుకొండ మండలంలో విషాదం
NEWS   Sep 07,2024 03:21 am
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని గొందిపల్లి గ్రామంలో సునీతమ్మ అనే వివాహిత శుక్రవారం కుటుంబ సమస్యల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source