విద్యుత్ మీటర్ లేని వారికి శుభావార్త
NEWS Sep 04,2024 12:32 pm
తెలంగాణలో కొత్తగా ఇళ్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్ బిగించుకోని వారికి ప్రభుత్వం రూ. 825కే మీటర్లు ఏర్పాటు చేయనుంది. Sep 15 వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీటర్ల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులిస్తే నేరుగా రశీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి.