Logo
Download our app
డివైడర్ ను ఢీకొన్న కారు
NEWS   Aug 24,2024 05:30 am
పామూరు పట్టణంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి వైపు నుంచి నెల్లూరు వెళ్తున్న కారు పట్టణంలోని జనతా గ్యారేజ్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పి ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source