Logo
Download our app
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక.. దాడులపై ఇజ్రాయెల్ ప్రకటన
NEWS   Jun 24,2025 09:25 pm
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ దేశంపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రతిగా తాము ఇరాన్‌లోని రాడార్ వ్యవస్థలపై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ధృవీకరించింది.
⚠️ You are not allowed to copy content or view source