Logo
Download our app
అయినవిల్లి: ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు
NEWS   Jun 20,2025 12:03 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నూతనంగా ఉపాధ్యాయులు కొల్లు శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. ఆయన తన కుమారుడు లియోనార్డును టెన్త్ క్లాస్, కుమార్తె చైత్ర వర్తనను 8వ తరగతిలోనూ కె.జగన్నాధపురం హైస్కూల్ లో చేర్పించి ఎందరికో ఆదర్శప్రాయులుగా నిలిచారు. ఆయన గొల్లవిల్లి హైస్కూల్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల హెచ్ఎం జి.సూర్య కుమారి, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు బుధవారం ప్రశంసించి ఘనంగా సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source