Logo
Download our app
ఏపీ బిష‌ప్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ ర‌త్న‌కుమార్
NEWS   Jun 18,2025 06:22 pm
ఏపీ బిష‌ప్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ ముత్తా బ‌త్తుల ర‌త్న‌కుమార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజ‌య‌వాడ పున్న‌మి ఘాట్ లో బుధ‌వారం సి.బి.ఎం. స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో ఏపీలోని 3 రీజియ‌న్ల‌కు చెందిన 300ల మందికి పైగా బిష‌ప్ లు పాల్గొన్నారు. వీరంతా క‌లిసి ఏపీ బిష‌ప్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడిని ఎన్నుకున్నారు. 2025 నుంచి 2030 వ‌ర‌కు అయిదు సంవ‌త్స‌రాల పాటు డాక్ట‌ర్ ఎం. ర‌త్న‌కుమార్ ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సి.బి.ఎం. సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source