ఇక నుంచి అమరావతే సింగిల్ రాజధాని
NEWS Jun 08,2025 07:27 am
మాజీ మంత్రి జోగి రమేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక నుంచి అమరావతే సింగిల్ రాజధాని అని అన్నారు. 3 రాజధానుల వల్ల వైసీపీ తీవ్రంగా నష్ట పోయిందన్నారు. ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చిన తర్వాత మేం మూడు రాజధానుల జోలికి వెళ్లబోమన్నారు. జగన్ మళ్లీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపడతామన్నారు. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు చేయడం తప్పేనన్నారు.