గత సర్కార్ ఆదేశాలతోనే నిధులు రిలీజ్ చేశా
NEWS Jun 06,2025 03:20 pm
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ఈటలను ప్రశ్నించింది కమిషన్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. సొంత నిర్ణయలు తీసుకోలేదని కమిషన్ కు స్పష్టం చేశారు. సాంకేతిక అంశాల గురించి తనకు తెలియదని వెల్లడించారు.